తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం వల్లనే పండినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని సీఎం ఆరోపించారు. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పిన కాళేశ్వర్ రావు.. అది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అని అన్నారు. గత ఏడాది, కాళేశ్వరం లేకపోయిన రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని తెలంగాణలో పండించామని సీఎం వెల్లడించారు.