యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు. పోచంపల్లి పేరుతో నకిలీ పట్టుచీరలు అమ్ముతున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నకిలీ ఇక్కత్ చీరలు స్వాధీనం చేసుకోగా.. దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చారు.