యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్స్

66చూసినవారు
యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్స్
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. సిద్దిపేట జిల్లా అక్బర్​పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈదారి నవీన్ (27) అనే ఆన్​లైన్​ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య రాధిక, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్