శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్.. వీడియో

50చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు తన ఇద్దరు కూతుళ్లను కూడా దర్శనానికి తీసుకెళ్లారు. ఈ మేరకు దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. టీటీడీ శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యతను ఆయన పరిశీలించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్