ఢిల్లీ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) మార్చి త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 2.8 శాతం తగ్గి రూ.2,267.1 కోట్లుగా నమోదైంది. 2022-23లో కంపెనీ నష్టం రూ.1,422.4 కోట్లకు తగ్గగా, ఆదాయం 25 శాతం పెరిగి రూ.9,978 కోట్లకు చేరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం భారీ నష్టాలను చవిచూస్తోంది.