మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆదివారం రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామని ఊర్మిళ - కొమురయ్య దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.