రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చాలి

79చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 22కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చారిత్రక కట్టడాల పరిరక్షణ అంశంలో కేంద్రంలోని బిజెపి సానుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ కట్టడాల పరిరక్షణ జాబితాలో రామగిరి ఖిల్లాకు స్థానం లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్