పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో శనివారం పాఠశాలకు గైర్హాజరైన పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు యేసుదాసు వారి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థులను విధిగా పాఠశాలకు పంపించాలని, పిల్లల చదువులకు సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.