ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ

1057చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఆలయంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్