మాఘ అమావాస్య జాతర సందర్భంగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం

2267చూసినవారు
మాఘ అమావాస్య జాతర సందర్భంగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగే మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ చెప్పారు. శనివారం ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు తగిన బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్