ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల కోర్టు న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. దీంతో పిన్నెల్లిని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ కేసులో రామకృష్ణారెడ్డిని ఏ-1గా చేర్చిన విషయం తెలిసిందే.