కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్లో అనర్హుల ఏరివేతకు చర్యలు తీసుకుంటోంది. ఈ స్కీమ్లో చాలామంది అనర్హులు ఉన్నారనే ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కీమ్లో అనర్హుల నుంచి ఇప్పటిదాకా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. లోక్సభలో దీనికి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.