సికింద్రాబాద్ లోని అంబర్ పేట్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ చేసిందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానం నాగేందర్ కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు. మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని విమర్శించారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చెల్లని రూపాయి లాంటి వారని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని ప్రజలు పట్టించుకోరని ఆయన అన్నారు.