ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వద్ద పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఆందోళన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాలలో ఎక్కించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.