ఏపీ, తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. ఓటింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.