ఖమ్మం-వరంగల్- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 4 లోపు ఎవరైతే క్యూలైన్లలో ఉంటారో వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు.