భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వెళ్లారు. కాసేపట్లో ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. మరికొంత సేపటిలో పుణ్య స్నానం ఆచరించనున్నారు.