యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది తద్వారా ఉద్యోగాలు కల్పించాలని కేంద్రప్రభుత్వం 05 ఏప్రిల్ 2016న 'స్టాండప్ ఇండియా' పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ పొందవచ్చు. ప్రతి బ్యాంకులోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలు దీనికి అర్హులు. https://www.standupmitra.in/ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.