భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మోడీ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేగంపేట నుంచి హెలికాప్టర్లో పటాన్చెరులోని పటేల్గూడకు వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.