మైనింగ్ రంగంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పురుషాధిక్య పరిశ్రమల్లో మహిళలకు సమాన అవకాశాలను సృష్టిస్తామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో కొనసాగుతోందని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా అనేక రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతోందని పేర్కొన్నారు. రైల్వేలకు 50 శాతం ఆదాయం బొగ్గు రవాణాతోనే వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.