IPL 2025 ఆరంభ మ్యాచ్కు ముందు ఈడెన్ గార్డెన్స్లో అట్టహాసంగా ఓపెనింగ్ సెర్మనీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నటి దిశా పటాని, గాయని శ్రేయా ఘోషల్ ఆడిపాడనున్నారు. కానీ, వర్షం వల్ల వేడుకలు, మ్యాచ్కు ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో ఈదురుగాలులు, మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఐపీఎల్ నిర్వాహకులతో పాటు, అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.