ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్తరుణ్ హీరోగా నటించిన తాజా సినిమా 'తిరగబడరా సామి'. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఈ మూవీలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.