సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చేవెళ్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు రూ. 17. 99 లక్షలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్