దేశంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి డా. బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి, తొర్రూర్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాయకులు దయానంద్ గౌడ్, ప్రతాప్, రమేష్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.