మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఎల్.బి నగర్ లో వారి విగ్రహానికి ఎల్. బి. నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు.