గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మల్కాజ్ గిరి పార్లమెంటు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నేతాజీ నగర్ కాలనీలో శ్రీసాయి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావటం వందకు వంద శాతం ఖాయం అన్నారు.