ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, ప్రతి ఒక్క రూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆర్కేపురం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద శర్మ పాల్గొన్నారు.