జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది.