రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరైనారు.