హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలకు ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పారని కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ. ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రజలు అందించిన మెజారిటీతోనే ఎంపీగా రెండోసారి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నానని అన్నారు.