పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకుని ముస్లిం సమాజానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు స్వియ క్రమశిక్షణ, జీవితంపట్ల సానకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవించేలా అల్లా ఆశీర్వదాలు ఉండాలని ఆకాంక్షించారు.