మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించిన స్థానికులు

64చూసినవారు
షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్ధాల టెండర్ ప్రక్రియపై స్థానికులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి తోడుగా ఆరెకటిక సంఘం నాయకులు తదితరులు మున్సిపల్ కమిషనర్ వెంకన్నను కార్యాలయంలోకి వెళ్తుండగా వారు ప్రశ్నించారు. పత్రికా ద్వారా టెండర్ పిలిచామని కమిషనర్ వెంకన్న చెప్పగా ఏ పత్రికలో ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అసలు ఆ పత్రిక సర్కులేషన్లో ఉందా? అని స్థానిక ఆరెకటిక సంఘం నాయకులు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్