ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

7803చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
షాద్ నగర్ పట్టణంలోని సంగమేశ్వర లాడ్జ్ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పాత జాతీయ రహదారి ఆర్టీసీ పెట్రోల్ పంపు ఎదురుగా ప్రమాద సంఘటన చోటు చేసుకోవడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు సడన్ గా మలుపు తిప్పడంతో పాదాచారిగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్