రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి పల్లకిని మోశారు. ప్రస్తుతం ఆలయంలో పంచాంగ శ్రవణం మరికాసేపట్లో చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.