మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులుతో పాటు రైతు కాలనీ నాయకులు సన్మానించారు. నవీన్ కుమార్ రెడ్డి నివాసం మొదళ్ళగూడలో సోమవారం సాయంత్రం నవీన్ కుమార్ రెడ్డిని కలుసుకొని శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేత బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, సుక్రవర్దన్ రెడ్డి కట్ట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.