కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆర్డీవో లోకేశ్వర్ విచారణ చేపట్టి పేపర్ మార్పు నిజమేనని తేల్చారు. రెండు బ్యాంకులకు వెళ్లి ప్రశ్నాపత్రాలు తెచ్చిన సెంటర్ చీఫ్ కో ఆర్డినేటర్ ఒక ప్రశ్నాపత్రం బదులు మరోటి ఇచ్చారని చెప్పారు. రెండు పేపర్లలో ఏ పేపర్కు సంబంధించిన పరీక్ష రాసినా దానిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.