తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారని జైలు వర్గాలు చెప్తున్నాయి. రోజులో రెండుసార్లు గంటన్నరసేపు చొప్పున ధ్యానం, యోగా చేస్తున్నారని తెలిపాయి. ఇతర ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్కు తన సెల్ను శుభ్రం చేసుకునేందుకు చీపురు, బకెట్ అందించాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు టేబుల్, కుర్చీ, విద్యుత్ కెటిల్ ఇచ్చాం’ అని వివరించాయి.