తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాబోయే రెండు, మూడు రోజుల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు, వచ్చే రెండు రోజుల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.