పశ్చిమ బెంగాల్లోని రెండు బూత్లలో రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బరసత్ లోక్సభ నియోజకవర్గంలోని ఒక బూత్లో, మధురాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని ఒక బూత్ లో రీపోలింగ్ కు కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే EC ఈ నిర్ణయం తీసుకుంది