జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజీత్ డోభాల్ను కేంద్రప్రభుత్వం 2024 జూన్ 13న మరోసారి నియమించింది. పదవీకాలంలో ఆయన క్యాబినెట్ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు. 2014 మే 30న డోభాల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు.