సీఎం రేవంత్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అక్రమ డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షానే స్వయంగా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పారంటే.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.