తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పుదుపాళయం ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ (35) రౌడీషీటర్. అతడిని రఘు, ఉసేన్ అనే ఇద్దరు కారులో వచ్చి కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనంతరం నిందితులు పారిపోయి దాక్కున్నారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు.