AP: వైసీపీలో అధినేత జగన్ తర్వాత అంతటి గుర్తింపు ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. అయితే YCPకి రాజీనామా చేసిన ఆయన.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా విజయసాయి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్యనేతలతో ఆయన టచ్లో ఉన్నారని, త్వరలోనే BJP తీర్ధం పుచ్చుకుంటారనే వార్త హాట్ టాపిక్గా మారింది. అందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, ఈ ఏడాది జూన్లో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరందుకుంది.