తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హైదరాబాద్లో 'సెల్యూట్ తెలంగాణ' ర్యాలీ చేపట్టారు. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొనగా వారికి పార్టీ శ్రేణుల ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి.