సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పట్ల చంద్రశేఖర్ రెడ్డి, సాగర్ శెట్కార్, మండల పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి, ఎంపీటీసీ రాధా కిషన్, జలశంకర్, చరణ్ పాల్గొన్నారు.