పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ లో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శనివారం పర్యటించారు. మురుగనీరు రోడ్డుపై ప్రవహిస్తుందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మురికి కాలువ శుభ్రం చేయించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.