జిన్నారం మండలం కొడకంచి మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శ్రీశైలం యాదవ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు బాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.