ఫిర్యాదులపై పిసిబి అధికారుల తనిఖీలు

72చూసినవారు
ఫిర్యాదులపై పిసిబి అధికారుల తనిఖీలు
బొల్లారం పారిశ్రామికవాడలో బుధవారం పిసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామికవాడలోని సూర్యచంద్ర మినరల్స్ డస్ట్ పొల్యూషన్ తో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులపై పిసిబి అధికారి అజయ్ తనిఖీలు చేశారు. పరిశ్రమ తీరును స్వయంగా పరిశీలించి హెచ్చరించారు. అదేవిధంగా పారిశ్రామిక వాడలో ఘన వ్యర్ధాల కాల్చివేతపై పరిశీలించి తగువిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.