సంగారెడ్డి జిల్లా అందోల్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.