వీధి కుక్కలతో జనం బెంబేలు

70చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పలు కాలనీలలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ దాడి చేస్తున్నాయి. మహిళలు, చిన్నపిల్లలు రాత్రిళ్లు బయటకు రావాలంటే జంకుతున్నారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కుక్కలు గుంపుగా ఉంటున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్